అలారం మోగింది. దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. అక్కడినుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లోనుంచి బెండకాయలు బయటకు తీసి కట్టుపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ కింద కూర్చుని బెండకాయలు తరిగింది. ఇంకా ఆయన , పిల్లలు లేవలేదు. టీ గిన్నె తీసి పక్కన పెట్టి , ఇడ్లీ గిన్నెను స్టవ్ ఎక్కించింది. పిండి కలిపి ఇడ్లీలు పెట్టింది. అప్పుడు బాత్రూంకు వెళ్ళొచ్చింది. చిన్న గ్లాసుతో మూడు గ్లాసుల బియ్యం తీసుకొని మూడుసార్లు కడిగింది. ఉడికిన సాంబారు కిందికి దించి , బియ్యం కుక్కర్ పెట్టింది. ఈలోగా ఉడికిన ఇడ్లిలు విడదీసి , గిన్నెలు సింక్ లో పడేసింది. సందు చూసుకుని పిల్లలిద్దరినీ లేవగొట్టి పేస్టు వేసి బ్రష్షులు చేతికిచ్చింది. మూడు విజిళ్ళు వినిపిస్తే మళ్ళీ వంటింట్లోకి నడచి కుక్కర్ కిందికి దించింది. అందులోని అన్నాన్ని హాట్ ప్యాక్ లోకి తీసి మూత పెట్టింది. తరిగిన బెండకాయ ముక్కలు ఒ...
Comments
Post a Comment